News and Entertainment

చనిపోయాడు...20 నిమిషాల తరువాత బ్రతికి మరో లోకం గురించి ఏమన్నాడంటే..?


చనిపోయిన తరువాత ఏమి జరుగుతుందనేది ప్రతీ ఒక్కరికి సమాధానం లేని ప్రశ్నే? మన పెద్దలు చాలా మంది చనిపోయిన తరువాత కొంతమంది స్వర్గానికి మరికొంతమంది నరకానికి వెళ్తుంటారని చెబుతుంటారు. అయితే దీనికి సరైన నిదర్శనం లేదు. అయిటా చాల మంది మీరు చనిపోయిన తరువాత మీరు ప్రేమించే లేదా అభిమానించే వ్యక్తులను కలుస్తారని చెబుతుంటారు.
ఇక్కడ మనకొక వ్యక్తి 20 నిమిషాలు చనిపోయి మళ్ళీ బ్రతికొచ్చిన అనుభవాలను పంచుకుంటున్నాడు. ఈ వ్యక్తి ఒక ట్రక్ కింద పడి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతను తన శరీరంలో సగ బాగానికి పైగా కోల్పోయాడు. అతను ట్రక్ కింద పడినప్పుడు అతని మెదడులో నిక్షిప్తమైన సమాచారాన్ని ఊహించి చెప్పాడు. అతను ట్రక్ కింద పడినప్పుడు అతను మెదడులో రంగులన్నీ మాయమయి కేవలం మంచు వంటి రంగులు మాత్రమే కనిపించాయని చెప్పాడు. ట్రక్ చక్రాలు అతని వెన్నుపూస, కాల్లపై నుంచి వెళ్ళడంతో పక్కటెముకలు విరిగిపోయాయి. అతని లివర్ రెండు ముక్కలయి, గుండె బ్లాక్ అయినది. ఆ సమయంలో అతను బతికే అవకాశం 5 శాతం మాత్రమే ఉంది. అప్పుడతనికి 8 గంటల ఆపరేషన్ జరిగింది.


ఆ తరువాత అతను చనిపోయాడు. అయితే అతను చనిపోయిన వెంటనే అతని బామ్మ నుదిటిపై రుద్దినట్టు కనిపించందట. ఆమెతో మాటాడాలని ప్రయత్నించినప్పటికీ కేవలం శ్వాస మాత్రమే బయటకు వచ్చిందని చెబుతున్నాడు. ఆ తరువాత ఆ వ్యకి బ్రతికి కోమాలోకి వెళ్ళిపోవడమే కాకుండా అతని ఊపిరితిత్తులలో ఒకటి పనిచేయడం మానేసింది. అప్పుడతని బామ్మ అతన్ని బ్రతికించడానికి సహాయపడిందని చెబుతున్నాడు. అతను తన 18 సంవత్సరాల పునరుజ్జీవనం జరిగినట్టు భావించాడు. ఆ తరువాత 22 రోజుల తరువాత కోమా నుంచి బయటపడ్డాడు. అయితే అతని రెండు కాళ్ళను తొలగించారు. అయితే అతని బ్రతకడం అధ్బుతం అని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ఇంచుమించు చనిపోయి మళ్ళీ బ్రతికొచ్చి చనిపోయిన తరువాత కూడా జీవితం ఉంటుందని,అక్కడ మిమ్మల్ని అభిమానించేవారిని కలుసుకోవచ్చని చెప్పాడు.


వినోదం,హెల్త్,దైవం మరిన్ని అప్డేట్స్ కొసం FaceBook పేజీని లైక్ చేయండి

మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి