దానికి తోడు జియో తాజాగా ఫ్రీ ఫోన్ అంటూ ప్రకటించిన నేపథ్యంలో ఎయిర్టెల్పై పిడుగు పడ్డట్లయ్యింది. ఫ్రీ మొబైల్తో ఇతర టెలికాం సంస్థలు అన్ని కూడా సర్దేసుకోవాలనే టాక్ వినిపిస్తుంది.
ఈ సమయంలోనే ఎయిర్టెల్ ధీటైన సమాధానం ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇండియన్ మొబైల్ సంస్థలతో ఎయిర్టెల్ చర్చలు జరుపుతుంది. తక్కువ మొత్తాలకు ఎయిర్టెల్ సదరు సంస్థల నుండి మొబైల్స్ను తీసుకునేందుకు సిద్దం అవుతుంది. ఆ ఫోన్ను తమ వినియోగదారులకు ఉచితంగా ఇవ్వాలని, సంవత్సరం పాటు కంటిన్యూగా నెలకు 100 రూపాయల రీచార్జ్ చేయాల్సి ఉంటుందట.
అలా వినియోగదారులను తమ వైపు ఆకర్షించేందుకు ఎయిర్టెల్ కొత్త ఎత్తుగడ వేసింది. మరి ఈ కొత్త ప్లాన్ వర్కౌట్ అయ్యేనా, జియోకు పోటీగా ఎయిర్టెల్ నిలిచేనా అనేది చూడాలి.