రాజమౌళి, ప్రభాస్ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కనీవిని ఎరుగని రీతిలో కలెక్షన్స్ను రాబట్టిన నేపథ్యంలో ప్రభాస్కు అంతులేని క్రేజ్ దక్కింది. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమాను చేస్తున్నాడు.
సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రం తర్వాత ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాను ప్రభాస్ చేస్తాడు. ఈ రెండు సినిమాలు చేసిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉండబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
‘బాహుబలి’ సినిమా సమయంలోనే ప్రభాస్ కోసం రాజమౌళి ఒక స్క్రిప్ట్ను సిద్దం చేయడం జరిగింది. అందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. సినిమాను కాస్త ఆలస్యంగా అంటే 2019లో ప్రారంభించి 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరో వైపు రాజమౌళి త్వరలో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ కాకుంటే మరో హీరోతో సినిమా మొదలు పెట్టబోతున్నాడు. ఈ సంవత్సరం చివర్లో ప్రారంభించి, వచ్చే సంవత్సరం చివర్లో సినిమాను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోసారి బాహుబలి కాంబో అంటే ప్రేక్షకులు పిచ్చెక్కి పోవడం ఖాయం.