పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో
శరత్ మరార్ నిర్మాతగా ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ ను కాటం రాయుడు
గ ఖరారు చేసారు. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక
సినిమాలో నటించనున్నాడని వార్తలు వెలువడ్డాయి. త్రివిక్రమ్ కూడా మిగతా అగ్ర
హీరోలను పక్కన పెట్టి పవన్ కోసం అదిరిపోయే కధ రెడీ చేస్తున్నాడని కూడా టాక్
వినిపించింది. జనసేన అధ్యక్షుడిగా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా
ఎంతగానో ఉపయోగపడుతుందని, ఆ రేంజ్ లో త్రివిక్రమ్ కదా రెడీ
చేస్తున్నాడని వార్తలు హల చల్ చేసాయి. అయితే కాటమరాయుడు తరువాత పవన్ తమిళ్
దర్శకుడు నీసన్ దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పేయడం ఆ సినిమా పూజా కార్యక్రమాలు
కూడా ముగిసిపోవడం జరిగింది.
ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఏ ఏం రత్నం నిర్మిస్తున్నారు.
ఈయన గతంలో పవన్ తో ఖుషి బంగారం సినిమాలను నిర్మించారు. మరి పవన్ ప్రాజెక్ట్ నుంచి
త్రివిక్రమ్ పేరు సడన్ గా ఎందుకు మాయమయింది అన్నదే ఇప్పుడు టాలివుడ్ లో మిలియన్
డాలర్ల ప్రశ్న. అసలు సంగతి ఏంటంటే మహేష్ బాబు 25 వ సినిమాను డైరెక్ట్ చేయాలని
త్రివిక్రమ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడని సమాచారం. ఈ విషయం తెలిసిన పవన్
కళ్యాణ్ ఇక త్రివిక్రమ్ తో లాభం లేదనుకొని నీసన్ కు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కు షాక్ ఇచ్చాడని టాలివుడ్ లో టాక్ నడుస్తోంది.