నిరుద్యోగులకు శుభవార్త. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి గుంటూరు జిల్లాలో జాబ్ మేళ నిఎవహిస్తున్నారు. గుంటూరు జిల్లా కేంద్రంలోని ఉపాధి కార్యాలయంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజని ప్రియ తెలిపారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు, రెజ్యూమ్తో జిల్లా ఉపాధి కార్యాలయంలో శనివారం ఉదయం 10.30 గంటలకు హజరు కావలెనని వెల్లడించారు.
ఈ జాబ్ మేళాలో ప్రముఖ ఫైనాన్షియల్ కంపెనీలకు రిలేషిన్షిప్ మేనేజర్లు, కస్టమర్స్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్లు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులు నేరుగా పాల్గొనవచ్చునని, ఎంపికైన వారికి వేతనం రూ.9000 నుండి ఉంటుందని.. అనుభవం బట్టి అంతకుమించి ఉంటుందని తెలిపారు. ఇతర వివరాల కొరకు 0863-2350060కు సంప్రదించాలని తెలిపారు.