News and Entertainment

పునర్జన్మ బాలుడు తన పొలానికి తీసుకువెళ్లి.. తాను గత జన్మలో ఎలా చనిపోయానో వివరించిన బాలుడు.. చిన్నారిని చూసేందుకు తరలివస్తున్నజనం


పునర్జన్మల గురించిన సంగతులు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. కొంతమంది చిన్నారులు తమ పునర్జన్మ గురించి చెబుతుండటం అప్పుడప్పుడు వింటుంటాం. అటువంటి సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని జీంద్ ప్రాంతానికి చెందిన జలాల్‌పురాకలా అనే గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం ఒక బాలుడు జన్మించాడు. ఇంట్లోని వారు బాలునికి ‘లవిష్’ అనే పేరుపెట్టారు. ‘లవిష్‘ మాట్లాడడం మొదలు పెట్టినప్పటి నుంచి ‘రామ్‌రా’ అని పలుకుతుండేవాడు. ఇది జలాల్‌పురాకలా గ్రామానికి సమీపంలోనే ఉన్నమరొక గ్రామం. లవిష్ తన తల్లి పేరు కమల అని చెబుతుంటాడు. బాలుని తీరుపై అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు అతనిని ‘రామ్‌రా’ గ్రామానికి తీసుకువెళదామని బయలు దేరారు. ఆ గ్రామం సమీపానికి చేరుకోగానే లవిష్ ఇంకా ముందుకు వెళ్లే దారిని చూపించసాగాడు. గ్రామంలోకి ప్రవేశించగానే తన గత జన్మ ఇంటి చిరునామాను చెప్పడంతో పాటు ఆ ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడకు వెళ్లాక తన పేరు ‘సంజీవ్’ అని చెప్పాడు. తన గతజన్మలోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల పేర్లు కూడా చెప్పాడు. ఇంతేకాదు తన పొలానికి తీసుకువెళ్లి ఒక ప్రాంతాన్ని చూపించాడు. తాను గత జన్మలో అక్కడ విద్యుత్ షాక్ తగిలి చనిపోయానని చెప్పాడు. సందీప్ తల్లిదండ్రులు కొన్ని సంవత్సరాల క్రితం తమ 14 సంవత్సరాల కుమారుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడని తెలిపారు. బాలుని పునర్జన్మ విషయం నిర్ధారించుకున్న ఇరు కుటుంబ సభ్యులు ఎంతో ఆనందించారు. ఈ వార్త తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఈ పునర్జన్మ బాలుడిని చూసేందుకు తరలివస్తున్నారు.