టాలీవుడ్ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం తెల్సిందే. మూడు రోజులుగా కిమ్స్ వైధ్యులు దాసరికి చికిత్స అందిస్తున్నారు. నిన్న దాసరి హెల్త్పై బులిటెన్ను కూడా విడుదల చేశారు. దాసరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు ప్రకటించారు. నిన్న సాయంత్రం దాసరికి ఆపరేషన్ జరిపినట్లుగా కూడా సమాచారం అందుతుంది. అయితే దాసరి హెల్త్ బులిటెన్ విడుదల కాక ముందు ఒక న్యూస్ ఛానెల్లో దాసరి చనిపోయారంటూ స్క్రోలింగ్ వచ్చిందట.
దాసరి చనిపోయారని, అయితే ఆ విషయాన్ని కిమ్స్ వైధ్యులు అధికారికంగా మరి కాసేపట్లో ప్రకటించబోతున్నట్లుగా సదరు ఛానెల్లో స్క్రోలింగ్ వచ్చింది. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆ స్క్రోలింగ్ను మార్చి, దాసరి ఆరోగ్యం బాగానే ఉందని అదే ఛానెల్లో స్క్రోలింగ్ వచ్చింది. ఆ తర్వాత కొంత సమయంకు హాస్పిటల్ హెల్త్ బులిటెన్ను విడుదల చేయడం జరిగింది.
సదరు ఛానెల్కు మోహన్బాబు మరియు కొందరు దాసరి సన్నిహితులు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడంతో వెంటనే స్క్రోలింగ్ను మార్చినట్లుగా తెలుస్తోంది. సంచలనం కోసం ఇలాంటి పిచ్చి పనులు మళ్లీ చేయవద్దని సదరు ఛానెల్కు మోహన్బాబు వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. నేడు దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ను విడుదల చేసే అవకాశాలున్నాయి.