స్త్రీ, పరుషుల్లో చాలా మందికి ఓ సమస్య ఉంటుంది. కొందరిలో వారి తొడల మధ్య రాపిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే తొడల వద్ద వస్త్రాల రాపిడీ ఎక్కువ అవ్వడంతో తొడలు ఎర్రగా కందిపోతుంటాయి. ఒకవైపు మంటతో పాటు.. మరోవైపు దురద పుడుతుంది. దీనికి చెమట అధికంగా పోయడం వల్ల కూడా చికాకు పడుతుంటాయి. ఈ కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఆఫీస్లో ఉన్నప్పుడో లేదా ఏదైనా నలుగురిలో ఉన్నప్పుడో అలా దురద వస్తే ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బందికి గురవుతాం.
ఇక సమ్మర్లో అయితే ఇలాంటి ఇబ్బంది వస్తే నరకమే. ఊబకాయులకైతే ఈ సమస్య నిరంతరం ఉంటూనే ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు, సూచనలు పాటిస్తే పాటిస్తే. వీటి నుంచి బయట పడే అవకాశాలు ఉన్నాయి. ఈ చిట్కాలు ఈ క్రింద చూద్దాం.
– మంట, దురదగా ఉన్న తొడ భాగాల్లో కొద్దిగా కొబ్బరినూనెను రాయడం వల్ల సమస్య నుంచి గట్టెక్కవచ్చు.
– ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 3 టేబుల్ స్పూన్ల నీరు, కొన్ని చుక్కల లవంగం నూనెలను తీసుకుని మిశ్రమంగా బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తొడలు రాసుకునే చోట రాయాలి.
– ఒక చిన్నపాటి పలుచని టవల్లో కొన్ని ఐస్ ముక్కలు వేసి ఆ టవల్ని చుట్టి సమస్య ఉన్న ప్రదేశంలో 5 నిమిషాల పాటు ఉంచాలి. కొంతసేపు ఆగిన తర్వాత మళ్లీ అలాగే చేయాలి. రోజులో ఇలా ఎక్కువ సార్లు చేస్తే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
– ముఖానికి పూసుకునే టాల్కం పౌడర్, రోల్ ఆన్ డియోస్ వంటి వాటిని సమస్య ఉన్న ప్రదేశంలో రాస్తే ఆ ఇబ్బంది తొలగిపోతుంది. మంట, దురద కూడా తగ్గుతాయి. బయటికి వెళ్తున్నప్పుడు వీటిని వాడటం వల్ల ఫలితం ఇంకా బావుంటుంది.